- Advertisement -
– అభిమానం చాటుకున్న ఎంబీఏ విద్యార్థి రాఘవేంద్ర
నవతెలంగాణ హైదరాబాద్: సాధారణంగా చిత్రాలను దింపడమే ఓ అరుదైన కళ. అలాంటిది సూక్ష్మ చిత్రకళతో ఆకట్టుకుంటున్నాడు ఓ కళాకారుడు. సుద్దముక్కలపై పేర్లు చెక్కుతూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి చెందిన ఎంబీఏ విద్యార్థి కోడూరి నాగ సూర్య రాఘవేంద్ర బాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అభిమానాన్ని చాటుకున్నాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సుద్ద ముక్కపై ‘CM రేవంతన్న` అని చెక్కారు.
- Advertisement -



