- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సహకారంతో మండల కేంద్రానికి చెందిన తోట లక్ష్మి కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.36000/- చెక్కు మంజూర అయిందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులు లక్ష్మీ కు చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ బాల్కొండ టౌన్ ప్రెసిడెంట్ సాగర్ యాదవ్, వేంపల్లి చిన్న బాల రాజేశ్వర్, ప్రసాద్ గౌడ్, ఎర్రం నరేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



