నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.25 గంటలకు ‘ముఖ్యమంత్రి’సీఎం కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సీ క్యాంపు రైతు బజారుకు చేరుకుని, అక్కడ కూరగాయల వ్యర్థాలను ఎరువుగా మార్చే ప్రక్రియను పరిశీలిస్తారు. అనంతరం కేంద్రీయ విద్యాలయం సమీపంలో జైరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్క్కు ఆయన శంకుస్థాపన చేస్తారు. తదుపరి 12.55 గంటలకు కేంద్రీయ విద్యాలయం వద్ద ప్రజావేదికలో పాల్గొని స్థానికులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5 గంటల వరకు టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశమై ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేసిన వారికి అభినందనలు తెలియజేస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 5.35 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకొని హైదరాబాద్కు పయనమవుతారు.
నేడు కర్నూలులో సీఎం పర్యటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES