- Advertisement -
నవతెలంగాణ – నిజాంసాగర్
మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయంలో శుక్రవారం నాగుపాము కలకలం రేపింది. కార్యాలయంలో తలుపులు సరిగా లేకపోవడంతో మెట్ల పైకి నాగుపాము వచ్చిందని సిబ్బంది తెలిపారు. గంట పాటు మెట్ల కిందే ఉండడం వల్ల సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో మిగతా జనాలు ఎవరూ అటువైపు వెళ్ళవద్దని సూచించారు.
- Advertisement -