- Advertisement -
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
వణుకుతున్న ఏజెన్సీ ప్రాంతాలు
హైదరాబాద్ : తెలంగాణలో చలి పంజా విసురుతోంది. సాయంత్రం కాగానే ఇండ్లకు చేరుకుంటున్నారు.మరోవైపు వచ్చేమూడు రోజుల్లో తెలంగాణలో చలి మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అంచనా వేసింది.ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.ఆదివారం ఆదిలాబాద్లో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మెదక్లో 11.3 డిగ్రీలు, హనుమకొండలో 13.5 డిగ్రీలు, రామగుండంలో 14.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- Advertisement -



