- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : చలి వణికిస్తోంది.. రాష్ట్రమంతటా సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు 7.8 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. దాదాపు అన్ని జిల్లాల్లో 13 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
- Advertisement -



