నవతెలంగాణ – ఆత్మకూర్ ఎస్
ఈత వనాలను కాపాడితే గౌడ కుటుంబాలకి జీవనదారం అవుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. వనమహోత్సవం లో భాగంగా గురువారం ఆత్మకూరు (ఎస్ ) మండలం పాత సూర్యాపేట గ్రామంలో గౌడ సొసైటీ భూమిలో ఈత వనాలు నాటారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పాత సూర్యాపేట గ్రామంలోని గౌడ సొసైటీ నాలుగు ఎకరాల్లో 1600 మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని ఈత మొక్కలని సంరక్షించాలని, నీటి కొరకు బోర్ వెల్ మంజూరు చేస్తామని, అలాగే నీటి తోట్టెలను నిర్మించి వాటి తో మొక్కలకు నీరు పోయాలన్నారు.
ఈ సందర్భంగా గీత కార్మికులు కలెక్టర్ కు కమ్మలతో చేసిన ప్రత్యేక బొకేలు అందించడంతో కలెక్టర్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డి ఎఫ్ ఓ సతీష్ కుమార్, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కే వేణా రేడ్డి, ఆర్ డి ఎ పిడి. వివి అప్పారావు , ఎక్సయిజ్ సూపరిటీడెంట్ లక్ష్మాణ్ నాయక్, డి ఎల్ పి ఓ నారాయణ రెడ్డి, ఆర్డీవో వేణుమాధవరావు, తహసీల్దార్ అమీన్ సింగ్, ఎంపిడిఓహసీం, మండల వ్యవసాయ అధికారి దివ్య, ఏపీఎం మంజుల, ఏపిఓ ఈశ్వర్ పంచాయతీ కార్యదర్శి స్వప్న, గీత కార్మికుల సంఘం అధ్యక్షుడు ఎలుగూరి జానయ్య గౌడ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వనమహోత్సవంలో ఈత మొక్కలు నాటిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES