సీఎంను ఆహ్వానించిన మహా గ్రూప్ చైర్మన్ వంశీకష్ణ
నవతెలంగాణ – హైదరాబాద్
మహా గ్రూప్, మహా భక్తి ఛానల్ సారథ్యంలో ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ వారు నిర్వహిస్తున్న శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఈ నెల 26న సాయంత్రం 5.00 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయవలసిందిగా మహా గ్రూప్ చైర్మన్ మారెళ్ళ వంశీకష్ణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని నేరుగా కలిసి ఆహ్వానించారు.
ప్రతి ఏడాది నిర్వహించే ఈ మహోత్సవం ఈసారి హైదరాబాదులో విశేషమైన ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొననున్నట్టు సమాచారం. ఈ వేడుకలో ప్రత్యేక పూజలు, శ్రీవారి సేవలు, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వారు వెల్లడించారు.
శ్రీనివాస కళ్యాణానికి రండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



