నవతెలంగాణ – కంఠేశ్వర్ : తెలంగాణ రైజింగ్ 100 రోజులలోపు కార్యాచరణ ప్రణాళిక కింద జరుగుతున్న పనులను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ నేపథ్యంలో సర్కిల్-5 ని తనిఖీ చేసి, ఆ తర్వాత ఈ ప్రణాళిక కింద పనులు జరుగుతున్న వివిధ ప్రాంతాలను సందర్శించారు. డి-52 కాలువను కంఠేశ్వర్, బైపాస్, ఫులాంగ్, ఐటీఐ గ్రౌండ్, ఆర్య నగర్ ఇంటర్నేషనల్స్తో సహా నగరంలోని కీలక ప్రదేశాలను పరిశీలించారు. పారిశుధ్య సిబ్బందిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పౌరులు ఫిర్యాదులకు కారణం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. శానిటరీ సూపర్వైజర్లు, సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఏరియా శానిటరీ జవాన్లు, కార్మికులు చురుకుగా పాల్గొన్నారు.
పారిశుధ్ద్య పనులను పరిశీలించిన కమిషనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES