నవతెలంగాణ – దుబ్బాక
దుబ్బాక నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న కాలువలు, తూముల పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ.. శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ పడాల వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాన్ని అందించారు. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను మంత్రికి వివరించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న వేళ పంటల సాగుకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు పెండింగ్ లో ఉన్న కాలువలు, తూముల పనులను వెంటనే పూర్తి చేసేలా అధికారుల ఆదేశించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి పనులు వెంటనే పూర్తయ్యేలా ఆదేశిస్తానని హామీ ఇచ్చినట్లు వినయ్ తెలిపారు.
“పెండింగ్ లో ఉన్న కాల్వలను పూర్తి చేయండి”
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES