Tuesday, June 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఈఎన్‌టీ, సరోజినీ దేవి ఆస్పత్రుల వైద్యులకు అభినందనలు

ఈఎన్‌టీ, సరోజినీ దేవి ఆస్పత్రుల వైద్యులకు అభినందనలు

- Advertisement -

– మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అరుదైన, క్లిష్టమైన సర్జరీ చేసి రోగి ప్రాణాలు కాపాడిన ఈఎన్‌టీ ఆస్పత్రి, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వైద్యులను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ఈ మేరకు సోమవారం మంత్రి ట్వీట్‌ చేశారు. వికారాబాద్‌ జిల్లా రాపోలే గ్రామానికి చెందిన రాజేందర్‌ అనే వ్యక్తి కంట్లో నుంచి ముక్కులోకి కత్తి దిగగా, ప్రయివేట్‌ ఆస్పత్రి వైద్యులు చేతులు ఎత్తేయడంతో, కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈఎన్‌టీ వైద్యులు రోగిని పరీక్షించి, సుమారు 4 అంగుళాలు కత్తి కంట్లో నుంచి, ముక్కులోకి దిగినట్టు గుర్తించారు. ఈఎన్‌టీ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ ఆనందాచార్య, సరోజినీ దేవి ఐ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ మోదిని నేతృత్వంలోని డాక్టర్ల బందం రాజేందర్‌కు ఆపరేషన్‌ చేసి కత్తిని బయటకు తీసింది. ప్రస్తుతం రాజేందర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -