- Advertisement -
డాక్టర్ రాజీవ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉస్మానియా మెడికల్ కాలేజ్ (ఓఎంసీ) అలుమ్ని అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్లకు టీపీసీసీ వైద్యుల విభాగం చైర్మెన్ డాక్టర్ రాజీవ్ శుభాకాంక్షలు తెలిపారు. 2025-27 పదవీకాలానికి జరిగిన ఎన్నికల్లో డాక్టర్లు కీర్తి స్వరూప్, శంకర్.కె, కేలు, ఉస్మానియా డాక్టర్లు మురళీకృష్ణ, సాయి దినేష్ రెడ్డి, సతీష్లు గెలిచినట్టు తెలిపారు. ఉస్మానియా వైద్యుల ఐక్యతను బలోపేతం చేస్తూ, సమాజానికి మరింత సేవ చేయడానికి కొత్త నాయకత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా డాక్టర్ రాజీవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
- Advertisement -



