- Advertisement -
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ప్రచారం
నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య,జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్ ఓటర్లను అభ్యర్దిoచారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాలతో గురువారం మారుతీనగర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదన్నారు. అందులో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
- Advertisement -



