పరకాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ హర్షం
నవతెలంగాణ – పరకాల
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ శాసనసభ స్థానం ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సాధించిన అఖండ విజయం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న ప్రజా పాలనకు నిదర్శనమని పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని శుక్రవారం నాడు పట్టణంలోని బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ శ్రేణులు భారీ సంబరాలు జరుపుకున్నారు. కొయ్యడ శ్రీనివాస్ నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అందరికీ స్వీట్లు పంచిపెట్టి ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జూబ్లీహిల్స్లో ఒక బీసీ బిడ్డను నిలబెట్టి గెలిపించడం సామాజిక న్యాయానికి నిదర్శనం అన్నారు. ఈ విజయం ఒక్క జూబ్లీహిల్స్ ప్రజలదే కాదని, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని స్పష్టం చేసింది అన్నారు. ఇకనుండి రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు కొయ్యడ శ్రీనివాస్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. జూబ్లీహిల్స్లో విజయం సాధించిన నవీన్ యాదవ్కు శుభాకాంక్షలు చెప్పారు.
ఈ సంబరాల కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ బుజ్జన్న, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మడికొండ శ్రీను, సమన్వయ కమిటీ సభ్యులు చిన్నాల గోనాథ్, ఈర్ల చిన్ని, పంచగిరి జయమ్మ, చందుపట్ల రాఘవరెడ్డి, దుబాసి వెంకటస్వామి, పసుల రమేష్, మర్క రఘుపతి గౌడ్, సదానందం గౌడ్, పోరాడ్ల సంతోష్, మడికొండ సంపత్ కుమార్, మంద నాగరాజు, రఘు నారాయణ, దార్నా వేణుగోపాల్, బొమ్మ కంటి చంద్రమౌళి, దుప్పటి సాంబశివుడు, బుచ్చు భాస్కర్, దావు పరమేశ్వర్, దుగ్గేల వినయ్, బాసాని సుమన్, సురేష్, బండారి కృష్ణ, మచ్చ సుమన్, నాగరాజు, సదన్నతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.



