Friday, June 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గంగమ్మ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి: బీఆర్ఎస్ నాయకులు 

గంగమ్మ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి: బీఆర్ఎస్ నాయకులు 

- Advertisement -
  • – పూర్తి కాకుంటే ఎమ్మెల్యేను అడ్డుకుంటాం 
    – ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతాం 
    నవతెలంగాణ-రామారెడ్డి 
  • ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్రావు స్పందించి గంగమ్మ బ్రిడ్జి  నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని మంగళవారం బి ఆర్ ఎస్ రామారెడ్డి మండల పార్టీ తరఫున డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పడిగెల శ్రీనివాస్ లు మాట్లాడుతూ… బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో రు 3 కోట్ల 8 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బ్రిడ్జి నిర్మాణం ఆగిపోయిందని, వెంటనే పూర్తి చేయాలని, ఈ బ్రిడ్జి నుండి ఆర్మూర్, భీమ్గల్, సిరికొండ తో పాటు రామారెడ్డి మండల ప్రజలు ఈ బ్రిడ్జి పైనుండి కామారెడ్డి జిల్లా కేంద్రానికి ప్రయాణాలు కొనసాగిస్తారని, మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి, శ్రీ కాలభైరవ దేవస్థానానికి భక్తులు ఈ మార్గoలో అధిక సంఖ్యలో వస్తారని, ఎమ్మెల్యే మదన్మోహన్ రావు రామారెడ్డి వాడినని, ఇక్కడే పెరిగానని చెప్పుకునే నీవు వెంటనే బ్రిడ్జి పునర్నిర్మానం చేపట్టాలని, ఇందిరమ్మ కమిటీ లాగా, బ్రిడ్జి పునర్నిర్మాణ సాధన కమిటీని ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
  • పనులు ప్రారంభించకుంటే ఆర్ అండ్ బి భవనాన్ని ముట్టడిస్తామని, పార్టీలకు అతీతంగా, ప్రజలతో కలిసి వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మదన్మోహన్ రావు అక్కడక్కడ బోర్లు వేయించారే తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని, గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే సురేందర్ చేసిన అభివృద్ధి ఉందని, అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనని సవాల్ విసిరారు. శ్రీరామనవమి నాడు ఎమ్మెల్యే 15 రోజుల్లో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని చెప్పి, నెలరోజులైనా పనులు పూర్తికాలేవని, పూర్తికాకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యేను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని, నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు సతీష్ గుప్తా, జంగం లింగం, కుషాంగి రాజనర్సు, గంగాధర్, శంకర్, మల్లేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -