- Advertisement -
-ఐకేపీ కార్యాలయానికి చేరిన వైనం
-సభ్యుల తీర్మానం మేరకు వ్యవహరిస్తామని సీసీల స్పష్టం
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని గుండారం గ్రామంలోని జయలక్ష్మీ మహిళ స్వసక్తి సంఘం సభ్యుల మద్య నెలకొన్న వివాదం బుధవారం ఐకేపీ కార్యాలయానికి చేరింది. ఐకేపీ కార్యాలయంలో జయలక్ష్మీ స్వసక్తి సంఘంలోని సభ్యులతో సీసీలు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి వివాదం పరిష్కరించేల చోరవ చూపారు. సంఘంలోని ఓ సభ్యురాలు దురుసుగా ప్రవర్తించి సభ్యులపై అబండాలు వేస్తోందని మేజారీటీ సభ్యులు సీసీల వద్ద అవేదన వ్యక్తం చేశారు. సభ్యురాలుకు భవిష్యత్తులో అన్యాయం జరుగుతుందని సీసీలు సభ్యులకు వివరించిన ససేమీరానడంతో మేజారీటీ సభ్యుల తీర్మానం మేరకు వ్యవహరిస్తామని సీసీలు స్పష్టం చేశారు.
- Advertisement -