– సమర్పణకు తుది గడువు జులై 17
– ఆగస్టు మొదటివారంలో ఆన్లైన్లో రాతపరీక్షలు
– వికలాంగుల రిజర్వేషన్ 5 శాతానికి పెంపు
– విద్యార్థులకు అందుబాటులో 50 వేల పీజీ సీట్లు : ఉన్నత విద్యామండలి చైర్మెన్ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ కుమార్
– నోటిఫికేషన్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరంలో వివిధ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) నోటిఫికేషన్ను శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ఎం కుమార్ హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 18 నుంచి సీపీగెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు వచ్చేనెల 17 వరకు ఉందని అన్నారు. ఆలస్య రుసుం రూ.500తో అదేనెల 24 వరకు, రూ.రెండు వేలతో 28 వరకు సమర్పించేందుకు అవకాశముందని వివరించారు. సీపీగెట్ రాతపరీక్షలు ఆన్లైన్లో ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రంలో పీజీ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు కలిపి 108 ఉన్నాయనీ, 51 సబ్జెక్టులకు రాత పరీక్షలుం టాయని అన్నారు. 297 కాలేజీల్లో గతేడాది 46,742 సీట్లున్నాయనీ, వాటిలో 21,560 భర్తీ అయ్యాయని వివరించారు. 2025-26 విద్యాసంవత్సరంలో ఈడబ్ల్యూ ఎస్ కింద నాలుగు వేల సీట్లు పెరిగే అవకాశముందన్నారు. దీంతో 50,742 పీజీ సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయాల్లో పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలను చేపడతామని అన్నారు. వికలాంగుల రిజర్వేషన్ను మూడు నుంచి ఐదు శాతానికి పెంచామని చెప్పారు. పూర్తి వివరాల కోసం షషష.శీరఎaఅఱa.aష.ఱఅ, ష్ట్ర్్జూర://షజూస్త్రవ్.్స్త్రషష్ట్రవ. aష.ఱఅ, షషష.శీబaసఎఱరరఱశీఅర.షశీఎ వెబ్సైట్లను సంప్ర దించాలని సూచించారు.
నాన్లోకల్ కోటా ఎత్తివేత : పాండురంగారెడ్డి
గత విద్యాసంవత్సరం వరకు ఏపీ విద్యార్థులకు నాన్లోకల్ కోటా కింద పీజీ ప్రవేశాలను కల్పించామని సీపీగెట్ కన్వీనర్ ఐ పాండురంగారెడ్డి చెప్పారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి నాన్లోకల్ కోటాను ఎత్తేశామనీ, ఏపీ విద్యార్థులు కూడా మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు తరహాలో (నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా) ఇతర రాష్ట్రాల కోటా కింద 20 శాతం ప్రవేశాలు పొందాలని స్పష్టం చేశారు. దరఖాస్తుల సమర్పణ, రాతపరీక్షలు, ధ్రువపత్రాల పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుందన్నారు. సీటు కేటాయించిన తర్వాత కాలేజీలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సంవత్సరానికి సంబంధించిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉండాలని సూచించారు. లేదంటే విద్యార్థులు ప్రవేశాల సమయంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సీపీగెట్ దరఖాస్తు ఫీజు ఎస్సీ,ఎస్టీలు రూ.600, ఇతరులు రూ.800 చెల్లించాలని కోరారు.
ఓయూ, మహిళా వర్సిటీ విభజన ప్రక్రియ ప్రారంభం : కుమార్
ఓయూ, మహిళా విశ్వవిద్యాలయం విభజన ఇంకా కాలేదని ఉస్మానియా వీసీ ఎం కుమార్ చెప్పారు. ఆ ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. బోధన, బోధనేతర సిబ్బందికి ఆప్షన్ సౌకర్యం కల్పిస్తామనీ, ఓయూలో పనిచేస్తారా?, మహిళా వర్సిటీలో పనిచేస్తారా?అనేది అడిగి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఎక్కువ మంది ఓయూకు ఆప్షన్ ఇస్తే తాత్కాలిక ప్రాతిపదికన కొంతమందిని మహిళా వర్సిటీకి కేటాయిస్తామనీ, ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని చెప్పారు. 2018లో పీహెచ్డీ ప్రవేశం పొంది వారి గడువు ముగిసిపోయిందన్నారు. వారు పీహెచ్డీ పరిశోధన ప్రాజెక్టును జులై 31 వరకు సమర్పించేందుకు గడువు ఇచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, శాతవాహన వర్సిటీ వీసీ యు ఉమేష్కుమార్, మహిళా వర్సిటీ వీసీ సూర్య ధనుంజరు తదితరులు పాల్గొన్నారు.
18 నుంచి సీపీగెట్ దరఖాస్తుల స్వీకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES