- Advertisement -
జిల్లా అధ్యక్షులు దొడ్ల సత్యనారాయణ రెడ్డి
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు దొడ్ల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో PRTU సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పి ఆర్ సి ని అమలు చేసి 317 జీవో ద్వారా నష్టపోయిన వారికి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కమలాకర్ రావు, మండల అధ్యక్షులు జంగు నాయక్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, మండల కార్యవర్గ సభ్యులు ప్రశాంత్, గీత, నిర్మల, ఉమా దేవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -