Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంట నష్టపరిహారం వెంటనే రైతుల అకౌంట్లో జమ చేయాలి            

పంట నష్టపరిహారం వెంటనే రైతుల అకౌంట్లో జమ చేయాలి            

- Advertisement -
  • నవతెలంగాణ-గోవిందరావుపేట 
  • పంట నష్టపోయిన రైతులకు పరిహారం అకౌంట్లో వెంటనే జమ చేయాలి అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ అన్నారు. శుక్రవారం మండలం పసర లో సిపిఎం పార్టీ ములుగు జిల్లా కమిటీ సమావేశం రత్నం రాజేందర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బండారు రవికుమార్ గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మాట్లాడుతూ       ములుగు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే రైతుల అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు .ఏప్రిల్ 1 నుండి మే 31 వరకు జిల్లాలో వడగండ్ల వాళ్ళతో జిల్లాలో వేలాది ఎకరాల పంట నష్టం జరిగిందని ఇప్పటికే  వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించినారని ప్రభుత్వం 2933 ఎకరాల కు 5.72 కోట్లు ములుగు జిల్లాకు విడుదల చేసినారు. ఈ పంట నష్టపరిహారం వాస్తవంగా కాస్తు లో ఉన్న రైతులందరికీ ఇవ్వాలని ఏజెన్సీ ఏరియాలో పట్టాలు లేకుండా అనేకమంది పేద రైతుల పంటలు దెబ్బతిన్నాయని వారికి కూడా వర్తింపజేయాలని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగిందని ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి జూన్ లో నష్టపరిహారం రైతుల అకౌంట్లో వేయాలని లేనియెడల రైతుల సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటికే మొక్కజొన్న రైతులు పెద్ద ఎత్తు నష్టపోయారని వారికి కూడా ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెయిల్ ఫిమేల్ వరి రైతులు కూడా రైతు నష్టపోయారని వారికి కూడా నష్టపరిహారం ఆయా కంపెనీ నుండి వచ్చే విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే జిల్లాలో వర్షాలు పడి రైతులు విత్తనాల కోసం పరుగులు తీస్తున్నారని జిల్లాలో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయని ప్రైవేట్ విత్తన కంపెనీలు పోటీలు పడి నకిలీ విత్తనాలు  రైతులకు అంటగడుతున్నాయని నకిలీ విత్తనాలను అమ్మకుండా అధికారులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు మోసపోకుండా మంచి కంపెనీ నుండి విత్తనాలు కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి గారు సిపిఎం జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకట్ రెడ్డి ఎండి దావూద్ పొదిల్ల చిట్టిబాబు రత్నం రాజేందర్ కొప్పుల రఘుపతిరావు జిల్లా  కమిటీ సభ్యులు తీగల ఆదిరెడ్డి సోమ మల్లారెడ్డి గుగ్గిళ్ళ దేవయ్య జాగటి చిన్న బచ్చల కృష్ణ బాబు దుగ్గి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు*
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -