నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు ప్రాజెక్టులపై ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధి బందంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో చర్చించారు.తెలంగాణ రైజింగ్ 2047 లో భాగంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో మౌళిక సదుపాయాల కల్పన, రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీలు, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్లో సివరేజ్ ప్లాంట్ల నిర్మాణం. హ్యం రోడ్ల విస్తరణ, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానం ద్వారా వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ విద్యుత్ అనుసంధానం, టీజీఆర్టీసీ ఈ-బస్లు, యంగ్ ఇండియా స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటిలలో చేపట్టే ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్ట్ వివరాలు, ఆర్ధిక పరమైన అంశాలపై ఈ సమావేశంలో సమాలోచనలు చేశారు. పరస్పర సహాకారంతో నిర్దేశించిన ప్రాజేక్టులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ తెలంగాణ పెట్టుబడులకు అనువైనదనీ, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ప్రణాళిక కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి టి.కె. శ్రీదేవి, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, టీజీఐఐసీ డైరెక్టర్ శశాంక, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇ.వి.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారని సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏడీబీ ప్రతినిధి బృందంతో సీఎస్ భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



