- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో గాలుల తీవ్రత పెరిగింది. విజయనగరం(D) గుర్ల కస్తూర్బాగాంధీ పాఠశాలలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. 30మంది విద్యార్థులకు విద్యుత్ షాక్ తగలడంతో ఆసుపత్రికి తరలించారు. చాలా జిల్లాల్లోని గ్రామాల్లో స్తంభాలు కూలి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు నేలకూలాయి. తీర ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. వర్ష ప్రభావిత బాధితులకు పునరావాస కేంద్రాల్లో వసతి కొనసాగుతోంది.
- Advertisement -



