నటుడు శివాజీ ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ‘దండోరా’. ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ మూవీని రూపొందించారు. నవదీప్, నందు, రవికష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఈనెల 25న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడు శివాజీ మీడియాతో చెప్పిన చిత్ర విశేషాలు..
‘కోర్ట్’ కంటే ముందే ‘దండోరా’ కథ విన్నాను. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ముందే ‘దండోరా’ మేకర్లు అడ్వాన్స్ ఇచ్చారు. కానీ ప్రొడక్షన్ పరంగా ఆలస్యమైంది. అలా ‘కోర్ట్’ ముందుగా రిలీజ్ అయింది. ఇందులో నా పాత్ర డిఫరెంట్గా ఉంటుంది. మంచోడా? చెడ్డోడా? అని చూసే ప్రేక్షకుడికి సరిగ్గా అర్థం కాదు. సినిమా చూసిన తరువాత ఆడియెన్స్ నా పాత్ర గురించి చెప్పాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో నేను వ్యవసాయ దారుడిగా కనిపిస్తాను. అయితే ఈ చిత్రంలోని అన్ని కారెక్టర్స్ నా చుట్టూనే తిరుగుతాయి. అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పాత్ర నాది. ఇలాంటి చిత్రాలు, కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఏదో అలా వచ్చి వెళ్లినట్టుగా ఏ పాత్ర కూడా ఉండదు. అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది.
ఇది పూర్తిగా సందేశాత్మక చిత్రం కాదు. అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమిది. అన్ని రకాల భావావేశాలున్న సినిమా ఇది. అద్భుతమైన సినిమా. ఇందులో గొప్ప స్క్రీన్ ప్లే ఉంటుంది. ‘కోర్ట్’లో మంగపతి పాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అంతే రెస్పాన్స్ ఇందులోని పాత్రకి కూడా వస్తుంది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న కారెక్టర్ లభించింది. ఎన్నో రకాల ఎమోషన్స్ చూపించే పాత్ర దొరికింది. అద్భుతమైన కంటెంట్తో ఎమోషనల్గా సాగే చిత్రమిది. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’, ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ‘ఎపిక్’ చిత్రాల్లో నటిస్తున్నాను.
‘దండోరా’లో అన్ని రకాల కమర్షియల్ అంశాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



