నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్ హీరో రవితేజకు పితృవియోగం కలిగింది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు(90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రాజగోపాల్ రాజు మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రవితేజ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
మరోవైపు రవితేజ రీల్ ఫాదర్ కోట శ్రీనివాసరావు రెండు రోజుల క్రితం కన్నుమూసారు. రవితేజ, కోట శ్రీనివాసరావు తండ్రి కొడుకులుగా ఇడియట్ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ సినిమాలో వారి మధ్య బాండింగ్ రియల్ ఫాదర్ అండ్ సన్ లాగా ఉంటుంది. కోట మరణంతో రవితేజ చాలా ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా కోటకు సంతాపం తేలుపుతు ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు రవితేజ. రెండు రోజులు క్రితం రీల్ ఫాదర్ కోట శ్రీనివాసరావు నేడు రియల్ ఫాదర్ భూపతి రాజు రాజగోపాల్ శాశ్వతంగా దూరమవడంతో రవితేజ శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ కష్ట సమయంలో మీ వెంట మేము ఉన్నామని ధైర్యంగా ఉండాలని రవితేజకు మద్దతుగా ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.