Sunday, December 7, 2025
E-PAPER
Homeజాతీయండీప్‌ఫేక్‌ను నియంత్రించాలి

డీప్‌ఫేక్‌ను నియంత్రించాలి

- Advertisement -

లోక్‌సభలో ప్రయివేటు బిల్లు
ప్రవేశపెట్టిన శివసేన ఎంపీ

న్యూఢిల్లీ : ప్రస్తుత కృత్రిమ మేధ(ఏఐ) యుగంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో డీప్‌ఫేక్‌ కూడా ఒకటి. ఈ డీప్‌ఫేక్‌ నియంత్రణకు సంబంధించిన బిల్లు లోక్‌సభ ముందుకువచ్చింది. ఇలాంటి కంటెంట్‌ కట్టడికి అవసరమైన లీగల్‌ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేలా ప్రయివేట్‌ మెంబర్‌ బిల్లును ప్రతిపాదించారు. శివసేన ఎంపీ శ్రీకాంత్‌ శిండే ఈ డీప్‌ఫేక్‌ బిల్లును ప్రవేశపెట్టారు. ఇలాంటి కంటెంట్‌ రూపొందించేందుకు వ్యక్తుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి చేయాలన్నారు. ”వేధింపులు, మోసం, తప్పుడు సమాచారం కోసం డీప్‌ఫేక్‌ను దుర్వినియోగం చేయడం పెరిగిపోయింది. దీని నియంత్రణకు సంబంధించి చర్యలు వెంటనే చేపట్టాలి” అని శిందే అన్నారు.

దురుద్దేశంతో ఇలాంటి కంటెంట్‌ను సృష్టించినా లేదా ఫార్వర్డ్‌ చేసినా అలాంటివారికి శిక్షలు పడాలన్నారు. వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రతగురించి ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో డీప్‌ఫేక్‌ టెక్నాలజీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ కలవరపెడుతోంది. ఈ డీప్‌ఫేక్‌ను ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు తేలికగా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధాని మోడీ కూడా గతంలో దీనిపై ఆందోళన వ్యక్తంచేశారు. డీప్‌ఫేక్‌ వీడియోలు సమాజానికి పెనుముప్పుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -