- Advertisement -
హైదరాబాద్తో రంజీ పోరు డ్రా
నవతెలంగాణ-హైదరాబాద్ : సొంతగడ్డపై జరిగిన రంజీ మ్యాచ్లో ఢిల్లీకి తొలి ఇన్నింగ్స్ కోల్పోయింది. సనత్ సంగ్వాన్ (211 నాటౌట్), ఆయుశ్ దోసేజా (209) ద్వి శతకాలతో తొలి ఇన్నింగ్స్లో ఢిల్లీ 529/4 భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 112.2 ఓవర్లో 411 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 118 పరుగుల ఆధిక్యం సాధించిన ఢిల్లీ.. 3 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో ఢిల్లీ 42 ఓవర్లలో 138/3తో నిలిచినా.. నాల్గో రోజు ఆట ముగియటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. హైదరాబాద్ ఒక్క పాయింట్తోనే సరిపెట్టుకుంది.
- Advertisement -