- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : రాష్ట్ర సరిహద్దుకు పూర్తిగా బార్డర్లో గల మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ ఆధ్వర్యంలో శనివారం అన్నదానం చేపట్టారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా పెళ్లిళ్లు చేసుకున్న దంపతులు ప్రత్యేకంగా సందర్శించి, పూజలు చేశారు. ఈ ఆలయానికి ప్రతి శని, సోమ వారాలతో పాటు పౌర్ణిమ అమావాస్య రోజున మూడు రాష్ట్రాలకు చెందిన భక్తులు ప్రత్యేకంగా సందర్శించి దర్శించుకుంటారు.
- Advertisement -