- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండిగో విమానయాన సంస్థ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం పట్ల కేంద్రం చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇండిగో సంక్షోభంపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని తెలిపింది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
- Advertisement -



