- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 2,16,300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా మిగతా చోట్ల కూడా ముసురు వాతావరణం నెలకొంది.
- Advertisement -