- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చారు.. ఇచ్చినప్పుడు ఇవ్వండి. ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా? లోక్సభ ఎన్నికల్లో రెండోసారి హామీ ఇచ్చినప్పుడు తెలియదా? 9 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. 11 మంది గెలిచిన నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పా? అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే.. ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? ఆలస్యమైనా సరే ఓపిక పడుతున్నా?’’ అన్నారు.
- Advertisement -