Sunday, June 29, 2025
E-PAPER
Homeబీజినెస్ఆగస్టు నుంచి పోస్టాఫీస్‌లలో డిజిటల్‌ పేమెంట్స్‌

ఆగస్టు నుంచి పోస్టాఫీస్‌లలో డిజిటల్‌ పేమెంట్స్‌

- Advertisement -

న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్టు నుంచి అన్ని పోస్టాఫీస్‌ల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ను స్వీకరించనున్నారు. పోస్టల్‌ విభాగంలో ఐటి నూతన మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా డిజిటల్‌ చెల్లింపులకు వీలవుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు పోస్టాఫీస్‌లు యుపిఐ వ్యవస్థతో అనుసంధానం కాలేదు. ఈ నేపథ్యంలో డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా లావాదేవీలు నిర్వహించే విధంగా కొత్త అప్లికేషన్‌ను తెస్తున్నామని పోస్టల్‌ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు 1 నాటికి అన్ని పోస్టాఫీసుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే కర్ణాటక సర్కిల్‌లో ప్రయోగాత్మకంగా ఐటి 2.0 కింద డిజిటల్‌ చెల్లింపులను స్వీకరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -