Sunday, June 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుచేప ప్రసాదం పంపిణీలో అపశ్రుతి..

చేప ప్రసాదం పంపిణీలో అపశ్రుతి..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మెదక్ జిల్లాకి చెందిన సత్యనారాయణ (75) అనే వృద్ధుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. ప్రసాదం తీసుకునేందుకు క్యూ లైన్లో నిలబడిన వృద్ధుడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. స్పృహ తప్పి పడిపోయిన వృద్ధుడికి సీపీఆర్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వృద్ధుడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప మందు ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -