- Advertisement -
నవతెలంగాణ: – రెంజల్: మండల కేంద్రమైన రెంజల్ గ్రామానికి చెందిన పోసాని రూ.28000, నగేష్ రూ.44వేల సీఎం సహాయ నిధి చెక్కులను అందజేయడం జరిగిందని మాజీ జెడ్పిటిసి నాగభూషణం రెడ్డి పేర్కొన్నారు. నిరుపేదలు ఆస్పత్రిలో చికిత్స పొందిన వారి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న వారిని గుర్తించి వారికి మాజీ మత్రి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సహాయ సహకారాలతో ఈ ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సాయిబాబా గౌడ్, సగ్గు వెంకటి, కురుమే శ్రీనివాస్, కొండలవాడి శేఖర్, గైని కిరణ్, సాయా గౌడ్, ఆసాని అనిల్, గవాస్కర్, శివకుమార్, కే సాయన్న తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -