- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 11వ వార్డుకు చెందిన కాపరబోయిన రాజవ్వ, ఎండీ సాదక్ అలీ, ఉల్లెంగుల దేవిశ్రీ, తుమ్మ యాదగిరి, పీ. వనజమ్మలు అనారోగ్యంతో బాధపుడుతున్నారు. ఈ క్రమంలో వారికి మంజూరైన రూ.1,09,500ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం ఆ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ నందాల శ్రీజ శ్రీకాంత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు కూరపాటి వెంకటేష్, పలువురున్నారు.
- Advertisement -


