- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
జైశ్రీరామ్ జై గోమాత మంగళవారం గోకుల్ గో సేవ సమితి ఆధ్వర్యంలో నాగపంచమి సందర్భంగా ఆవుపాల పంపిణీ నిర్వహించారు. ఇందులో 94 సెంటర్లలో వివిధ గ్రామాలలో చుట్టుపక్కల ఆవు పాలు వితరణ నిర్వహించారు. గత మూడు సంవత్సరాల నుండి ఆవుపాల పంపిణీ నిర్వహించబడుతుంది దాదాపు 1000 లీటర్ల దాకా పంచడం జరిగింది. పెద్ద రామ మందిర్లో గల గోశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు తోడుపునూరిరామ్మోహన్, కోశాధికారి బాల శేఖర్, కౌటిక శంకర్, మాదాని శ్రీధర్, పి సతీష్, జి రాజశేఖర్, టి దయాకర్, నల్లనగేష్, సంతోష్ ఏం రాము, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -