- Advertisement -
నవతెలంగాణ – తంగళ్ళపల్లి : దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గీత నగర్, విద్యానగర్ కు చెందిన విద్యాభిమానులు విద్యార్థులకు సోమవారం బుక్కులు పంపిణీ చేశారు. గుండేటి వేణు, బండారి శివ, గుగ్గిళ్ళ రాజేష్, శ్రీగాద సిద్దు, కట్ల సత్యనారాయణ -విమల, చిందం వెంకటస్వామి కలిసి దాదాపు రూ.10వేల విలువ గల ప్రింటెడ్ నోట్స్ విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా దాదాలకు ప్రధానోపాధ్యాయులు సుభాష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -