నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలంలోని ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయాలన్న దృక్పథంతో రుద్రూర్ పరిశోధన కేంద్రం నుంచి సేకరించిన విత్తనాలను రైతులకు అందజేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి గ్రామంలో నాణ్యమైన విత్తనాలను వాడాలని రైతులకు వారు సూచించారు. ప్రతి గ్రామానికి 10 కిలోల చొప్పున రెండు బస్తాలు వరి ధాన్యం, మూడు కిలోల పెసర కిడ్స్ తయారుచేసి ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. ఒక్కొక్క రైతు వద్ద కేవలం 50 రూపాయల బిల్లు ను ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. ఆసక్తిగల రైతులు నాణ్యమైన విత్తనాలను వాడాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో రుద్రూర్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సిరాజుద్దీన్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అజయ్, ప్రసాద్, సాయిలు, రైతులు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES