నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతి రైతు భూసార పరీక్ష చేయించుకోవాలని మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు అన్నారు. భూసార పరీక్షలతో భూమి నాణ్యత తెలుస్తోందన్నారు. తద్వారా పంటల సాగుకు అనుకూలంగా ఎంత మోతాదులో ఎరువుల వాడకం, రైతులకు ఎరువులపై ఖర్చు తగ్గుతుందన్నారు. దీంతో భూకాలుష్యాన్ని నివారించొచ్చని సూచించారు. మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా 74వ ఎపిసోడ్లో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు భూసార పరీక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భముగా రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ..ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం మొక్కలు, డ్రిప్, అంతర పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నదని, ఆయిల్ పామ్లో అంతర పంటలుగా కోకో, మిరియాలు, వక్క, సాగు చేయడం వలన ఒకే భూమిలో ఎక్కువ రకాలైన పంటల సాగు చేసి, అధిక ఆదాయం పొందవచ్చునని తెలియజేసినారు. భూసార పరీక్ష పత్ర ఫలితాల ద్వారా ఎరువులు వాడుకునే విధానం గురించి వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త డా. మాధవి వివరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరక్టర్ డా బి.గోపి, ఉద్యాన శాఖ డైరక్టర్ యాస్మిన్ బాషా, మార్కెటింగ్ శాఖ డైరక్టర్ లక్ష్మి బాయి, వ్యవసాయ, ఉద్యాన-పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు.

                                    

