- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని అడ్వాలపల్లి గ్రామ రైతులకు పీఎంకెఎస్ వై పథకం ద్వారా 75శాతం సబ్సిడీలో మంజురైన ఛార్జింగ్ పంపులు, తైవాన్ పంపులు, పరదాలు, మోటార్ లు, కల్టివేటర్స్ తదితర పనిముట్లను బుధవారం గ్రామ సర్పంచ్ అజ్మీరా సారక్క, బిఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు అజ్మీరా బాలాజీ నాయక్, ఉప సర్పంచ్ బానోతు రాజేందర్, టెక్నీకల్ అసిస్టెంట్ రేఖా శేఖర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అజ్మీర శంకర్, అడ్వాల రాజు, బానోతు సమ్మయ్య, ఇప్ప కృష్ణకర్, అజ్మీరా రాజు, రాంనాయక్, శ్రీను, సమ్మయ్య, తిరుపతి, ప్రభాకర్, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



