Monday, June 23, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌కు ఆయుధాలు విక్రయించొద్దు

ఇజ్రాయిల్‌కు ఆయుధాలు విక్రయించొద్దు

- Advertisement -

– లండన్‌ వీధుల్లో కదం తొక్కిన ప్రజలు
– వేలాది మందితో మార్చ్‌
లండన్‌:
గాజాలో ఇజ్రాయిల్‌ చేస్తున్న మారణ హోమానికి వ్యతిరేకంగా లండన్‌లో ప్రజలు ఎలుగెత్తారు. పాలస్తీనాకు మద్దతుగా వేలాది మంది మార్చ్‌ నిర్వహించారు. ఇజ్రాయిల్‌ నరమేధాన్ని ఖండించారు. పాలస్తీనాలో అక్రమణలకు ఇజ్రాయిల్‌ ముగింపు పలకాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఇరాన్‌పై దాడులను కూడా ఇజ్రాయిల్‌ ఆపాలని డిమాండ్‌ చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు కారణమవుతున్న ఇజ్రాయిల్‌కు ఆయుధాలు విక్రయించడం ఆపాలని బ్రిటన్‌ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బ్రిటన్‌ ప్రధాని చేతులు రక్తంతో తడిసాయని నినాదాలు చేశారు. బ్యానర్లు ప్రదర్శించారు. ‘నేషనల్‌ మార్చ్‌ ఫర్‌ పాలస్తీనా’ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. సెంట్రల్‌ లండన్‌లోని బ్రిటీష్‌ మ్యూజియంకు సమీపంలోని రస్సెల్‌ స్వ్కేర్‌ నుంచి బ్రిటీష్‌ పార్లమెంట్‌కు ఆనుకొని ఉన్న వీధి వరకూ ఈ ర్యాలీ జరిగింది. ఈ వీధిలోనే ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌, ఇతర ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఈ ర్యాలీ జరిగింది. ఇజ్రాయిల్‌కు ఆయుధాలు విక్రయిస్తున్నందుకు, గాజాలో ఇజ్రాయిల్‌ హత్యాకాండను ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోనందుకు బ్రిటన్‌ ప్రధాని చేతులు రక్తంతో తడిసాయని ప్లకార్డులు ప్రదర్శించారు. ‘ప్రధాని.. మీరు.. సిగ్గుపడాలి’ అని బిగ్గరగా నినాదాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -