- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు ఘన నివాళులర్పించారు. కొమరయ్య అమరత్వం, నాటి రాచరిక పాలకుల నుంచి నేటి ప్రజా వ్యతిరేక పాలకుల మీద సాగుతున్న ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి, రాష్ట్రాన్ని సాధించి, అనంతరం పదేండ్లపాటు బాలారిష్టాలను అధిగమించి, స్వయం పాలనను దేశానికే ఆదర్శంగా నిలబెట్టుకోవడంలో అమరుల త్యాగాల స్పూర్తి ఇమిడి వున్నదని ఆయన అన్నారు.
- Advertisement -



