- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలో కుక్కల బెడద రోజురోజుకు అధికం అవుతోంది. దీంతో జనాలు జంపుతున్నారు. రాత్రి వేళల్లో ఎక్కడికి వెళ్లాలన్నా వీటా భయానికి జనాలు జంకుతున్నారు. అర్దరాత్రి ఎటు చూసినా గుంపులు గుంపులుగా కుక్కలు వీధుల్లో తిరుగుతున్నాయి. తెల్లవార్లు మొరుగుతూనే ఉంటాయి. అంతేకాదు చిన్న ఆవు లేగదూడలను, బర్రె దుడలకు ఎత్తుకెళ్లి పీక్కుతింటున్నాయి. అందుకని కుక్కల బెడద నివారించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -