నూతన ఎస్ఐ గా ఉపేందర్ చారి బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ – తంగళ్ళపల్లి : మండలంలో ఎవరు దూరం అలవాట్లకు మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దని నూతన ఎస్సై ఉపేందర్ చారి అన్నారు. తంగళ్ళపల్లి మండల నూతన ఎస్ఐగా ఉపేందర్ చారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, మత్తు, తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్టేషన్ కి వచ్చి పిర్యాదు చేయాలన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. అత్యవసర సమయయంలో 100 నెంబర్ కు డయల్ చేయాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దు: ఎస్ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES