Thursday, June 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆయిల్ ఫామ్ సాగుతో రెట్టింపు ఆదాయం

ఆయిల్ ఫామ్ సాగుతో రెట్టింపు ఆదాయం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారిస్తే ఆ రెట్టింపు ఆదాయం వస్తుందని నాగార్జున్ సాగర్ డివిజన్ ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి  తెలిపారు. గురువారం పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామం లో గల కత్తి జయసింహరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ మెగాప్లాంటేషన్ కార్యక్రమాన్ని  రైతు జయసింహరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఉద్యానవన అధికారి మురళి మాట్లాడుతూ  మూడేళ్ల పాటు కష్టపడితే 30 సంవత్సరాల పాటు రైతులకు నికర ఆదాయం వస్తుందని అన్నారు. ప్రభుత్వం ఈ సాగుకు సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. లోహియా ఆయిల్‌ ఫామ్‌ ప్లాంటేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్‌ ఫామ్‌సాగుపై జిల్లాలో నెలరోజుల పాటు విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు ఆయిల్ మ్ సాగుకు సంబంధించిన రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవలసిందిగా తెలిపారు. పతంజలి కంపెని జిల్లా మెనెజర్ మధుసూదన్ రెడ్డి రైతులకు ఆయిల్ పామ్ సాగు మెలకువలను తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో  అయిల్ ఫామ్ ప్రాంతీయ అధికారి సంపత్ కుమార్, ఆయిల్ పామ్ క్షేత్ర సిబ్బంది వెంకన్న, శ్రీను, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -