Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కమ్మర్ పల్లిలో డ్రై డే కార్యక్రమం 

కమ్మర్ పల్లిలో డ్రై డే కార్యక్రమం 

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో మంగళవారం గ్రామ పంచాయతీ, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన డ్రై డే కార్యక్రమాన్ని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ పరిశీలించారు. గ్రామ పంచాయతీ, ఆరోగ్య సిబ్బంది తో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి కుండిలను, పూల కుండీలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.పనికి రాని టైర్లు, బకెట్లలో, ఖాళీ కొబ్బరి బొండాలలో నీళ్లు నిల్వ ఉంచకూడదన్నారు. పనికి రాని వస్తువులను పడేయలని, కూలరులో ఉన్న నీళ్లను తీసివేసి శుభ్రంగా ఉంచుకోవాలని లేదంటే వీటన్నింటి వలన రోజుల తరబడి నిల్వ ఉన్న నీటిలో లార్వా, దోమలు వృద్ధి చెంది ఆరోగ్యానికి హాని చేస్తాయని తెలిపారు. ప్రజలు కూడా సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, రోజుల తరబడి నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.పలు నివాస గృహాల్లో పాత వస్తువుల్లో నిల్వ ఉన్న నీటిని సిబ్బందితో పారబోయించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి గంగాజమున, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad