- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: టిబెట్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.2గా నమోదైంది ఇవాళ ఉదయం 9:27 గంటల సమయంలో 20 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని వెల్లడించింది. కాగా, ఈ నెలలో భూకంపం సంభవించటం ఇది మూడోసారి. ఈనెల 8న రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకోగా, ఈనెల 12న 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. టిబెటన్ పీఠభూమి ప్రాంతం భూకంపాలకు నిలయంగా ఉంటుందని, టెక్టోనిక్ ప్లేట్ల కదలికల కారణంగా ఇక్కడ తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తాయని భౌగోళిక శాస్త్రవేత్తలు చెపుతున్నారు.
- Advertisement -