- Advertisement -
నవతెలంగాణ-హైదారాబాద్: మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎందుర్కొంటున్న తమిళనాడు మంత్రి పెరియసామి ఆయన కుటుంబం సభ్యుల ఇళ్లలో శనివారం ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంత్రి కుమారుడు అయిన ఐపి సెంథిల్ కుమార్, చెన్నై, డిండిగల్, మదురైలలో ఉన్న బంధువుల ఇళ్లలో మొత్తం 6 లొకేషన్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి. మంత్రిపై గతంలో మంత్రిపై మనీలాండరింగ్ కేసు కూడా నమోదైంది. ఇందులో భాగంగానే ఈ దాడులు జరిగినట్లు సమాచారం అందుతుంది. ఏప్రిల్ 2025లో మద్రాస్ హైకోర్టు అతనిపై చార్జెస్ ఫ్రేమ్ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా తాజా దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -