- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలతో విరుచుకుపడ్డారు. చైనా దిగుమతులపై అదనంగా మరో 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలతో అమెరికా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. నాస్డాక్కు 3.56శాతం, డోజోన్స్కు 1.90శాతం, ఎస్అండ్పీ 500 సూచీకి 2.71శాతం మేర నష్టం కలిగింది. శుక్రవారం ఒక్కరోజే అమెరికా మార్కెట్లలో 1.5 ట్రిలియన్ డాలర్ల మేర మదుపర్ల సంపద ఆవిరి అయింది.
- Advertisement -