- Advertisement -
నవతెలంగాణ -పరకాల
టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులుగా ఏకు రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన జిల్లా మహాసభల్లో రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రకటించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన రాష్ట్ర జిల్లా నాయకులకు రవికుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ టిడబ్ల్యూజేఎఫ్ బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. పరకాల పట్టణానికి చెందిన రవికుమార్ జిల్లా నాయకులుగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పలు జర్నలిస్ట్ సంఘాల నాయకులు రవికుమార్ కు అభినందనలు తెలియజేశారు.
- Advertisement -