Thursday, December 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంచాయతీ పోరులో ఎన్నికల బహిష్కరణ 

పంచాయతీ పోరులో ఎన్నికల బహిష్కరణ 

- Advertisement -

– రెండు తాండాల మధ్య విభేదాలు 
– ఎస్పీ, ఆర్డీవో సూచించిన ఓటు వేయాలె 
నవతెలంగాణ-రామారెడ్డి 

తాండాల మధ్య విభేదాలు ఎన్నికల బహిష్కరణకు దారి తీసిన ఘటన మండలంలోని గోకుల్ తండాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని గోకుల్ తాండ గ్రామపంచాయతీ పరిధిలో పెద్ద తండా పరిధిలో 410, చిన్న తాండ పరిధిలో 255 ఓట్లు కలవు. గిద్ద ఎంపిటిసి పరిధిలో గిద్ద, రాధాయిపల్లి తో పాటు గోకుల్ తాండ గ్రామపంచాయతీ కలదు. గత ఎంపిటిసి ఎలక్షన్లో ఓ అభ్యర్థి చిన్న తాండకు రు 250 లక్షలు ఇచ్చారని, పెద్దతాండవారు ఆరోపిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి పెద్ద తండాకు ఏకగ్రీవం కోసం రు 13 లక్షల40 వేల రూపాయలు ఇచ్చినట్లు చిన్నతండ వారు ఆరోపిస్తున్నారు. డబ్బుల విషయంలో రెండు తండాల మధ్య విభేదాలు రావడంతో, చిన్న తాండ పరిధిలో గల 1,2,3 వార్డులలో ఒక్కొక్క అభ్యర్థి పోటీ చేసి, నామినేషన్ ఉపసంహరించుకోవడంతో, ఎన్నికలు జరగలేవు. సర్పంచ్ పదవికి పెద్ద తండా నుంచి ఒకరు, చిన్న తాండ నుంచి ఇద్దరు పోటీ చేసి చిన్న తాండ వారు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పిఎస్పీ రాజేష్ చంద్ర, ఆర్డిఓ వీణ సందర్శించి చిన్న తాండ ఓటర్లకు అవగాహన కల్పిస్తూ, నిరుపయంగా నచ్చిన నాయకునికి ఓటు వేయాలని, ఎవరు నచ్చకుంటే నోట అవకాశం కూడా ఉందని సూచించిన , పెద్ద తాండకు వెళ్లే ప్రసక్తే లేదని, చిన్న తండాలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తే ఓటు హక్కును వినియోగించుకుంటామని తెగేసి చెప్పడంతో అధికారులు వెన్ను దీరిగారు. చిన్న తండా ఒకరిద్దరు తప్ప ఓటు హక్కు వినియోగించుకోలేదు. అనంతరం ఎస్పి రామారెడ్డిని, ఏఎస్పి చైతన్య రెడ్డి అన్నారం, రెడ్డిపేట్, రామారెడ్డి పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -