నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అశోక్ నగర్ లంబడి హక్కుల పోరాట సమితి తీజ్ కమిటీ వద్ద సమావేశం ఏర్పాటు చేసి స్వాముల మహారాజ్ ఎన్నికలను నిర్వహించారు. ఈ నేపధ్యంలో హథీరాం బావాజీ, మహాసంగ్ శివరాం మహారాజ్ సమక్షంలో లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా హాథీరాం మహాసంఘ జిల్లా అధ్యక్షులుగా రాంజీ మహారాజ్, కార్యదర్శిగా రాజు మహారాజ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గణేష్ నాయక్, బంజారా సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శీను నాయక్, తీజ్ కమిటీ అధ్యక్షులు లింగం నాయక్, జిల్లా శాఖ సేవ్య మహారాజ్, రాజు మహారాజ్, నిజామాబాద్ జిల్లా శాఖ నారాయణ మహారాజ్, చరణ్ మహారాజ్, చందర్ మహారాజ్, మురళీ మహారాజ్, శ్రవణ్ నాయక్, రూప్ సింగ్ నాయక్, పుల్ చంద్, విజయ్ లు పూజారి మహారాజ్ ను ఘనంగా సన్మానించారు.
ఎల్ హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో స్వాముల మహారాజ్ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES